వయనాడ్​ ఘటనపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు: సీఎం విజయన్​

 వయనాడ్​ ఘటనపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు: సీఎం విజయన్​

వయనాడ్​ ఘటనపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్​ షా స్పందించారు. కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉందని ఈ నెల 23న కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని అమిత్​ షా అన్నారు.  ముందే హెచ్చరించినా ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందన్నారు... 

అమిత్​ ప్రకటనకు కేరళ ముఖ్యమంత్రి విజయన్​ కౌంటరిచ్చారు.  వయినాడ్​ ఘటన విషయంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని సీఎం విజయన్​ అన్నారు.  బీజేపీ ప్రభత్వం ప్రకృతి విపత్తును రాజకీయం చేయడం దురదృష్టకరమని అంటూ... ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.  కేరళ సర్కార్​ ను బ్లేమ్​ చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎల్లో అలర్ట్​ ఉందని కేరళ ముఖ్యమంత్రి విజయన్​ అన్నారు.