
టొరాంటో: ఖలిస్తాన్ ఉగ్రవాదంపై కెనడా సంచలన ప్రకటన చేసింది. తమ నేల నుంచే ఖలిస్తానీ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఈ మేరకు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) వార్షిక నివేదికలో వెల్లడించింది.
‘‘భారత్ లో హింస, దాడుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడాను స్థావరంగా వాడుకుంటున్నారు’’ అని నివేదికలో తెలిపింది.