గురుకుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

గురుకుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

మధిర, వెలుగు:  అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో చేపట్టిన సమీకృత గురుకులాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా  చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేస్తారు. నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనులను మ్యాప్ ద్వారా పరిశీలించారు. 

అద్భుతమైన మేధస్సుతో కూడిన మానవ వనరులను అందించడమే యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యమని, ప్రపంచ స్థాయి విద్యాబోధన అందించడమే ధ్యేయంగా నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలన్నారు. ఈ స్కూల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఏర్పాట్లు ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇండోర్,  ఔట్ డోర్ క్రీడలు ఆడుకునేందుకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం క్వార్టర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాడమిక్ బ్లాక్ మార్చిలోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఈఈ బుగ్గయ్య, బోనకల్ మండల తహసీల్దార్ రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.