ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం మార్కెట్​కు సోమవారం 60 వేల కొత్త తేజ రకం మిర్చి బస్తాలు రావడంతో నిండిపోయింది.  జెండా పాట రూ.23,500  పలికింది. వరుస సెలవులతో మార్కెట్​ను మిర్చి ముంచెత్తింది. వ్యాపారులు.. ఆయిల్ రకం అంటూ, ఇతర కారణాలను సాకుగా చూపుతూ రూ.20 వేలకు మించి ధర ఇవ్వకపోవడంతో నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం