ఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో వేటగాళ్లు

ఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో వేటగాళ్లు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్  ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అలుగును వేటాడి, విక్రయించిన కేసులో 8 మందిని ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్​ఆర్వో కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ లో కొందరు వ్యక్తులు అడవి అలుగును వేటాడి, విక్రయించినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.

దీనిపై లోతుగా విచారణ జరిపి, 8 మందిని అదుపులోకి తీసుకొని, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది ఉన్నారని, వారిని గుర్తించి పనిలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే నిందితులందరినీ మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. సెక్షన్ ఆఫీసర్ రవీందర్, సిబ్బంది ఉన్నారు.