మెజార్టీ సీట్లు గెలవాలి .. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కో ఆర్డినేటర్లే కీలకం : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మెజార్టీ సీట్లు గెలవాలి .. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కో ఆర్డినేటర్లే కీలకం : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని కొనసాగించాలి
  • ఆరు రాష్ట్రాలు/యూటీలకో ఆర్డినేటర్లతో కీలక భేటీ
  • రాష్ట్రం నుంచి భట్టి, ఉత్తమ్, పొన్నం, సీతక్క,కొండా సురేఖ హాజరు
  • కోఆర్డినేటర్ల కోసం ఢిల్లీలో వార్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఖర్గే ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు : పార్టీ నియమించిన లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్థానాల కో ఆర్డినేటర్లే అధిష్టానానికి కండ్లు, చెవులని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజలకు దగ్గరవడంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేలా పని చేయాలని సూచించారు. ఎక్కువ స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపైనే ఉందని గుర్తుచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిల్లో లీడర్లను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు.

గురువారం తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పుదుచ్చేరికి సంబంధించిన లోక్ సభ నియోజకవర్గాల కాంగ్రెస్ కో-ఆర్డినేటర్లతో ఖర్గే కీలక భేటీ నిర్వహించారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ముఖ్య నేతలు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి అంశాలపై ఖర్గే దిశానిర్దేశం చేశారు.

మొత్తం ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 106 లోక్ సభ స్థానాలకు మెజార్టీ స్థానాల్లో గెలవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి అనుకున్న రీతిలో సీట్లు రాబట్టగలిగితే.. ఉత్తరాది నుంచి ఇండియా కూటమితో బీజేపీకి కళ్లెం వేయొచ్చని చెప్పారు. కో-ఆర్డినేటర్ల కోసం ఢిల్లీలో వార్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు నేతలకు తెలిపారు.

ఖజానాను గత సర్కార్ ఖాళీ చేసింది : పొన్నం

రాష్ట్రంలోని 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని వివరించారు. 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

13 నుంచి 14 స్థానాల్లో గెలుపు మాదే : ఉత్తమ్

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 13 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్ అన్నారు. నల్గొండ సీటులో 3 లక్షల మెజారిటీతో పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఏఐసీసీ అగ్రనేతలు నిర్మాణాత్మక సూచనలను చేశారని మంత్రి సీతక్క అన్నారు. తమకు బాధ్యతలిచ్చిన స్థానాల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పోరాడుతామన్నారు. ఫిబ్రవరి లోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరినం : భట్టి

తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారు. అత్యధిక స్థానాలు గెలిచేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పని చేస్తాం” అని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని ఖర్గే చెప్పారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.