మహబూబ్నగర్లో 4 రోజుల నుంచి కిడ్నాప్లు జరుగుతున్నాయి

మహబూబ్నగర్లో 4 రోజుల నుంచి కిడ్నాప్లు జరుగుతున్నాయి

మహబూబ్ నగర్  పట్టణంలో నాలుగు రోజుల  నుంచి కిడ్నాప్ లు  కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ ఆరోపించారు. నాగరాజు  అనే   ప్రైవేటు ఉద్యోగిని  కొందరు వ్యక్తులు తీసుకెళ్లారని ఆమె  తెలిపారు. ఆయనతో పాటు  విశ్వనాథ్, యాదయ్య , రఘులను తీసుకెళ్లారని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై   వేసిన ఎలక్షన్ పిటిషన్  విత్ డ్రా  చేసుకోవాలని.. కిడ్నాప్  చేసినట్లు స్థానికంగా చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.  కిడ్నాప్ కు  గురైన వ్యక్తులకు, మంత్రికి  ఏమైనా సంబంధం  ఉందా..? తేల్చాలి.. ఎస్ఓటి పోలీసులు తీసుకెళ్లి ఉంటే పోలీసులే  సమాధానం చెప్పాలన్నారు డీకే అరుణ. 
అసలు మహబూబ్ నగర్ పట్టణంలో ఏం జరుగుతుందో పోలీసులు వివరించాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ వివాదంపై విచారణ చివరి దశకు చేరుకున్నందునే ఈ కిడ్నాప్ లు జరుగుతున్నాయని చర్చ సాగుతోందని.. కిడ్నాప్ లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధం లేకపోతే మంత్రి సమాధానం చెప్పాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిపై వెంటనే స్పందించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

రష్యా సైన్యంపై తిరగబడుతున్న పిల్లలు, మహిళలు

ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్

కూతురు మృతి.. దుఃఖాన్ని దిగమింగి సెంచరీ చేశాడు

ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు