డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఇటీవల కలకలం సృష్టించిన ముగ్గురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీపీ కార్తికేయ వివరాల ప్రకారం.. జిల్లాలోని నవీపేట్కు చెందిన గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్(21) పాత నేరస్థుడు. పలు దొంగతనాలు చేసి జువైనల్హోంకు వెళ్లి వచ్చాడు. సిటీలోని సాయిబాబా టెంపుల్ వాచ్మన్ తల పగలగొట్టి హుండీ దొంగిలించాడు. ఈ కేసులో 3 ఏండ్లు జైలు శిక్ష అనుభవించి 2 నెలల కింద రిలీజ్అయ్యాడు. డబ్బు కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి డిచ్పల్లిలోని హార్వెస్టర్ గ్యారేజీలో ఉన్న పంజాబ్కు చెందిన హరపాల్సింగ్, జోగిందర్సింగ్, సంగారెడ్డి జిల్లాకు చెందిన సునీల్ పై దాడి చేసి చంపాడు. ఒకేరోజు ముగ్గురు హత్యకు గురవ్వడంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అడిషనల్ సీపీ స్వామి, ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పాత నేరస్తుల ఇండ్లల్లో ఆదివారం ఉదయం నుంచి సోదాలు చేయగా సిటీలోని గాజులపేటలో ఉంటున్న శ్రీకాంత్ ఇంట్లో రక్తపు మరకలతో ఉన్న షర్ట్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు కోసం తానే ముగ్గురిని సుత్తితో తలపై కొట్టి చంపానని ఒప్పుకున్నాడు.హత్యకి ఉపయోగించిన సుత్తి, డబ్బు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.
పైసల కోసమే .. ముగ్గుర్ని చంపిండు
- క్రైమ్
- December 13, 2021
లేటెస్ట్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం
- హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నరు : తన్నీరు హరీశ్రావు
- తల్లి, అక్క మందలించారని సూసైడ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ