పైసల కోసమే .. ముగ్గుర్ని చంపిండు

పైసల కోసమే .. ముగ్గుర్ని చంపిండు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్‌‌‌‌పల్లి మండల కేంద్రంలో ఇటీవల కలకలం సృష్టించిన ముగ్గురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీపీ కార్తికేయ వివరాల ప్రకారం.. జిల్లాలోని నవీపేట్​కు చెందిన గంధం శ్రీకాంత్​ అలియాస్​ మల్లేశ్(21) పాత నేరస్థుడు. పలు దొంగతనాలు చేసి జువైనల్​హోంకు వెళ్లి వచ్చాడు. సిటీలోని సాయిబాబా టెంపుల్​ వాచ్‌‌‌‌మన్‌‌ తల పగలగొట్టి హుండీ దొంగిలించాడు. ఈ కేసులో 3 ఏండ్లు జైలు శిక్ష అనుభవించి 2 నెలల కింద రిలీజ్​అయ్యాడు. డబ్బు కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి డిచ్‌‌‌‌పల్లిలోని హార్వెస్టర్ ​గ్యారేజీలో ఉన్న పంజాబ్​కు చెందిన హరపాల్​సింగ్, జోగిందర్​సింగ్, సంగారెడ్డి జిల్లాకు చెందిన సునీల్ పై దాడి చేసి చంపాడు. ఒకేరోజు ముగ్గురు హత్యకు గురవ్వడంతో కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు అడిషనల్‌‌ సీపీ స్వామి, ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3స్పెషల్ ​టీంలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పాత నేరస్తుల ఇండ్లల్లో ఆదివారం ఉదయం నుంచి సోదాలు చేయగా సిటీలోని గాజులపేటలో ఉంటున్న శ్రీకాంత్ ​ఇంట్లో రక్తపు మరకలతో ఉన్న షర్ట్​ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు కోసం తానే ముగ్గురిని సుత్తితో తలపై కొట్టి చంపానని ఒప్పుకున్నాడు.హత్యకి ఉపయోగించిన సుత్తి, డబ్బు, 3 సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.