కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ ‘సీరియస్ సబ్జెక్టుల కంటే కామెడీ కథలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తీశా. ఫస్ట్ హాఫ్ యూత్కి నచ్చేలా, సెకండాఫ్ ఫ్యామిలీకి నచ్చేలా ఉంటుంది.
ఓవరాల్గా సినిమా మొత్తం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. నాన్న (ఏఎం రత్నం)గారు రషెస్ చూసి బాగుందన్నారు. అలాగే కిరణ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కూడా రఫ్ కట్ చూసి హ్యాపీ ఫీలయ్యారు. ప్రస్తుతం నాన్నతో కలిసి ‘7/జి బృందావన కాలనీ’ సీక్వెల్ కోసం ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్నా. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవుతుంది’ అని చెప్పాడు.