రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
  •      కిసాన్ మోర్చా తెలంగాణ శాఖ డిమాండ్ 

ఖైరతాబాద్, వెలుగు : ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని సంయుక్త  కిసాన్​మోర్చా తెలంగాణ శాఖ డిమాండ్​ చేసింది. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ టర్మరిక్​ఫార్మర్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ ​టేబుల్​సమావేశం జరిగింది.   రైతు నేతలు లఖ్విందర్​సింగ్​ అవౌలాక్, నల్లమల వెంకటేశ్వరరావు,  కె. నరసింహనాయుడు మాట్లాడుతూ.. నల్లచట్టాల రద్దు కోసం చేసిన  ఉద్యమంతో వల్లే కేంద్రం వెనక్కు తగ్గిందని గుర్తుచేశారు.

ఆ సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని ఆరోపించారు.  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యమంలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ​చేశారు.   ఈ సదస్సులో  రైతు నేతలు శాంతకుమార్​, జగ్జీత్​సింగ్​దలేవాల్, కేవీ బిజ్జు, అభిమాన్​ కోర్, సచిన్ ​మల్హోత్రా తదితరులు మాట్లాడారు.