బీజేపీ సోషల్ మీడియా టీమ్​పై కిషన్ రెడ్డి గరం

బీజేపీ సోషల్ మీడియా టీమ్​పై  కిషన్ రెడ్డి గరం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సోషల్​మీడియా టీమ్​పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్​మీడియాలో బీఆర్ఎస్​చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సోషల్​మీడియా టీమ్​తో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

జీహెచ్​ఎంసీలో పార్టీని బలో పేతం చేయడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని జీహెచ్​ఎంసీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. కాగా, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్​పై కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మైనంపల్లి, తలసానిని తరచూ కలుస్తున్నారన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం.