హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు

హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు

హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సంగారెడ్డి నుంచి మొత్తం 158కిలో మీటర్ల దూరం రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నీ కలిసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ , ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ , జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి నార్తర్న్ పార్ట్ లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 9వేల 522కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇది మొత్తం 17వేల కోట్ల ప్రాజెక్టు అని చెప్పారు కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డుతో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఓడిపోయే స్థానంలో మా చిన్నమ్మకు టికెట్ : పీవీ మనవడు

ఒకే అడ్రస్ పై 32.. బోధన్ లో నకిలీ పాస్ పోర్టుల కలకలం