గాంధీనగర్: ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక ఐపీఎల్ సీజన్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (35) తీసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆదివారం (మే 31) గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ పవర్ ప్లేలో జీటీ ఓపెనర్స్ సాయి సుదర్శన్, శుభమన్ గిల్ వికెట్లు తీయడం ద్వారా ఆర్సీబీ ఈ రేర్ ఫీట్ నెలకొల్పింది.
గతంలో ఈ రికార్డ్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పేరిట సంయుక్తంగా ఉండేది. 2023లో ముంబై, 2023లో ఆర్సీబీ పవర్ ప్లేలో 33 వికెట్లు తీశాయి. ఐపీఎల్ 2026 పవర్ ప్లేలో 35 వికెట్లు తీసి ఆర్సీబీ ఈ రికార్డును బద్దలుకొట్టింది.
GT ఓపెనర్లపై భువి, హేజిల్వుడ్ పైచేయి
ఐపీఎల్ 2026లో గుజరాత్ ఓపెనర్స్ గిల్, సాయి సుదర్శన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. టోర్నీలో చెరో 700 రన్స్ చేసి అత్యధిక రన్స్ చేసిన జాబితాలో టాప్ 5లో ఉన్నారు. ఇలాంటి ప్రమాదకర జోడీని కీలకమైన ఫైనల్ మ్యాచులో ఆర్సీబీ స్టార్ బౌలర్స్ భువి, హేజిల్వుడ్ కట్టడి చేశారు. మూడో ఓవర్లో హేజిల్ వుడ్ బౌలింగ్లో రజిత్ పాటిదార్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు గిల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ సుదర్శన్ను ఔట్ చేశాడు.
►ALSO READ | ఫైనల్లో కోహ్లీ షో.. గుజరాత్ను చిత్తు చేసి వరుసగా రెండోసారి కప్పు కొట్టిన ఆర్సీబీ
