
జమ్మూకాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. గురువారం (ఆగస్టు 14) కిష్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. ప్రసిద్ద మచైల్ చండీమాతా యాత్రకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ గ్రామంలో యాత్రకు వెళ్తున్న లంగర్ (కమ్యూనిటీ కిచెన్ ) కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 12మంది మృతి చెందారు. వరదల్లో అనేక మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశి క్లౌడ్ బరస్ట్ ఘటన మరువకముందే జమ్మూ కాశ్మీర్ లో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
జమ్మూకాశ్మీర్ లోని చోసిటి, పాద్దర్, కిష్వార్ లలో క్లౌడ్ బరస్ట్ తో భారీ విధ్వంసం జరిగింది. మచైల్ మాతా ఆలయం యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు రోడ్లు, ఇళ్ళు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.
🚨 More visuals from Chositi, Padder, Kishtwar, J&K, show massive destruction after cloudburst.
— Siddharth (@Siddharth_00001) August 14, 2025
Flash floods devastate roads, homes, and infrastructure along Machail Mata Yatra route.
Rescue ops by Army, NDRF, SDRF ongoing.#Cloudburst #JammuAndKashmir #Kishtwar pic.twitter.com/7y7rS53gRF
మచైల్ పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో చివరి గ్రామమైన చోసిటీలో గురువారం క్లౌడ్ బరస్ట్ లో సగం గ్రామం కొట్టుకుపోయింది.. అనేక ఇళ్లు బురద, రాళ్ల కింద భూస్థాపితం అయ్యాయి. స్థానిక అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar following a cloud burst. Rescue Operations have been started. pic.twitter.com/MKj5DQwrKK
— ANI (@ANI) August 14, 2025
మచైల్ మాతా యాత్ర మార్గంలోని చిషోటిలో క్లౌడ్ బరస్ట్ తర్వాత దాదాపు 60 మంది గల్లంతయ్యారు. వారిని వెతికేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా అనేక మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత పుణ్యక్షేత్రానికి వార్షిక యాత్రను నిలిపివేశారు.
⚡🚨 Chishoti area of Kishtwar (Jammu division)
— OsintWorld 🍁 (@OsiOsint1) August 14, 2025
Early Reports are coming in of heavy loss of life and property.
DC Kishtwar Confirms 12–15 De@ths in Chositi Cloudburst and many injured. pic.twitter.com/QwPv1wzHPz
మచైల్ మాతా యాత్ర ప్రారంభ స్థానం అయిన కిష్త్వార్లోని చోసిటీ ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటికే NDRF 180 మంది సభ్యులను ప్రభావిత ప్రాంతానికి తరలించింది.