ఐపీఎల్ 2023 సీజన్లోకోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ధావన్ హాఫ్ సెంచరీ సాధించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(12) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స డక్ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన లివింగ్స్టోన్(15)ను వరుణ్ చక్రవర్తీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దీంతో పంజాబ్ 3 వికెట్లకు 58 పరుగులు చేసింది.
నడిపించిన ధావన్..
ఈ సమయంలో జితేశ్ శర్మ(21)తో కలిసి కెప్టెన్ ధావన్ జట్టును నడిపించాడు. వీరిద్దరు నాల్గో వికెట్ కు 53 పరుగులు జోడించిన అనంతరం జితేశ్ శర్మ పెవీలియన్ చేరాడ. ఆ వెంటనే అర్థ సెంచరీ చేసిన శిఖర్ ధావన్ కూడా ఔటయ్యాడు. చివర్లో రిషి ధావన్(19), షారూఖ్ ఖాన్(21), హర్ప్రీత్ బ్రార్ చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.