Cricket World Cup 2023: కోహ్లీ నన్ను టెస్టు మ్యాచ్ ఆడమన్నాడు: రాహుల్

Cricket World Cup 2023: కోహ్లీ నన్ను టెస్టు మ్యాచ్ ఆడమన్నాడు: రాహుల్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచాడు. ఆసీస్ పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్ తో హీరో అయిపోయాడు. 2 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ సహకారంతో ఓటమి నుండి గట్టెక్కించాడు. 97 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇంతటి అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ "నేను క్రీజ్ లోకి వచ్చినప్పుడు జట్టు చాలా కష్టాల్లో ఉందని గ్రహించాను. కానీ ఎక్కువగా భయపడలేదు. వికెట్ ఎలా ఉందని కోహ్లీని అడిగాను. దానికి కోహ్లీ పిచ్ చాలా క్లిష్టంగా ఉందని చెప్పి కొన్ని ఓవర్లపాటు నన్ను టెస్టు క్రికెట్ ఆడమన్నాడు. దురదృష్టవశాత్తు నా  సెంచరీ మిస్సయింది. అయినా నాకు బాధగా లేదు. భారత్ ని గెలిపించినందుకు సంతోషంగా ఉంది" అని తెలిపాడు. 

ఇదిలా ఉండగా.. రాహుల్ అద్భుత విజయంతో టీమిండియా వరల్డ్ కప్ లో బోణీ కొట్టి పాయింట్ల ఖాతాను తెరిచింది. ఈ నెల 11 న ఆఫ్ఘనిస్తాన్ తో ఢిల్లీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈ మ్యాచుకు యువ ప్లేయర్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. కాగా.. హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడేందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యేడు.