
హైదరాబాద్, వెలుగు : జీవో 111 రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం కమిటీని వేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిని చైర్మన్గా నియమించారు. సభ్యులుగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ జనరల్సెక్రటరీ జ్ఞానేశ్వర్, ఆర్థిక వేత్త లుబ్నా సార్వత్, సేవ్అర్బన్ లేక్స్(సోల్) ఫౌండర్ కన్వీనర్ జస్వీన్ జైరథ్లను నియమించారు. కాగా, ఈ కమిటీ శుక్రవారం గాంధీభవన్లో తొలి సమావేశాన్ని నిర్వహించింది. 111 జీవోను ఎత్తేయడం వల్ల జంట జలాశయాలకు నష్టం జరుగుతుందని కోదండ రెడ్డి అన్నారు. పర్యావరణ వేత్తలు, అన్ని వర్గాల వారితో సమావేశమై లోతు గా అధ్యయనం చేస్తామని, సమగ్ర నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.