గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 12న గన్పార్క్లో దీక్ష చేపట్టాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం నిర్ణయించారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయాన్నే ఆయన ఇంటి వద్ద మోహరించారు.
కోదండరాంని ఎటూ వెళ్లనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ అఖిల పక్ష నేతల సూచనతో ఇవాళ్ల ఇంట్లోనే 10 గంటలకు మౌన దీక్షకు కూర్చోనున్నట్లు ఆయన వెల్లడించారు.
పరీక్ష రద్దు చేసే వరకు పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరీక్ష నిర్వహణకు టైం ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం దారుణమన్నారు. శాంతియుతంగా తెలిపే నిరసనను అడ్డుకోవద్దని విన్నవించారు.