వెకేషన్ నుంచి వచ్చాక హాస్పిటల్కు వెళ్లిన కోహ్లీ, అనుష్క శర్మ

వెకేషన్ నుంచి వచ్చాక హాస్పిటల్కు వెళ్లిన కోహ్లీ, అనుష్క శర్మ

తీరికలేని క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ..కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌతాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ వైఫ్ అనుష్క శర్మ, కూతురు వామికాతో వెకేషన్ను ఫుల్గా ఎంజాయ్ చేశాడు. తమ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను అనుష్క, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు. అయితే వెకేషన్ను పూర్తి చేసుకున్న విరుష్క జంట..సోమవారం ఇండియాకు తిరిగివచ్చింది.  ముంబై ఎయిర్ పోర్టులో సోమవారం మధ్యాహ్నం వీరిద్దరు దిగారు. అనుష్క బ్లాక్ కలర్ డ్రెస్లో మెరిసిపోగా..కోహ్లీ వైట్ అండ్ వైట్లో దర్శనమిచ్చాడు. వీరిద్దరు బయటకు వచ్చాక కెమెరాకు ఫోజులు ఇచ్చారు. 

మధ్యాహ్నం ముంబై ఎయిర్ పోర్టులో దిగిన విరుష్క జంట..సాయంత్రం హాస్పిటల్కు వెళ్లారు.  కోహ్లీ అనుష్క జంట  కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద కన్పించారు. వీరిద్దరు   హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్  వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక విహార యాత్ర నుంచి వచ్చిన వెంటనే.. విరుష్క జంట  హాస్పిటల్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. 

అభిమానులు మాత్రం కోహ్లీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క మళ్లీ ప్రెగ్నెంట్ కావచ్చని ఊహించుకుంటున్నారు. కొందరైతే ఒకడుగు ముందుకు వేసి..త్వరలో విరాట్కు వారసుడు వస్తాడని జోస్యం చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎవరికి వారు ఊహించుకుంటుంటే..కోహ్లీ దంపతులు మాత్రం.. హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లామనేది చెప్పలేదు.