
కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం కోసం ఐఎన్టీయూసీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆవిష్కరించారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ప్రేమ్సాగర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కాంగ్రెస్పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. యూనియన్గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ఏరియా వైస్ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు, కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్, గరిగె స్వామి, చందుమోహన్, ఆకుల రాజన్న, మల్లారెడ్డి, రంగిశెట్టి శ్రీనివాస్, నంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన సింగరేణి ఆఫీసర్లు
శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందారం, శ్రీరాంపూర్ఓసీపీల పీవోలు ఎం.శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి తదితరులున్నారు.