KKRvsRCB: ఈడెన్లో శార్దూల్ విధ్వంసం..కోల్ కతా భారీ స్కోరు

KKRvsRCB: ఈడెన్లో శార్దూల్ విధ్వంసం..కోల్ కతా భారీ స్కోరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. బెంగుళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 204 పరుగులు సాధించారు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా..26 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ డేవిడ్ విల్లే బౌలింగ్ లో  ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మన్ దీప్ సింగ్ ను కూడా విల్లే పెవీలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే కెప్టెన్ నితీష్ రాణా కూడా ఔటవడంతో కోల్ కతా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న గుర్భాజ్..

ఈ సమయంలో కోల్ కతాను గుర్భాజ్, రింకు సింగ్ జట్టును ఆదుకున్నారు. నాల్గో వికెట్ కు 42 పరుగులు జోడించారు. ఇదే సమయంలో గుర్బాజ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం గుర్భాజ్ కర్ణ్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. గుర్భాజ్ తర్వాత క్రీజులోకి వచ్చిన రస్సెల్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. 

దుమ్మురేపిన శార్దూల్..

ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగుళూరు బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 29 బంతుల్లో 68 పరుగులతో ఈడెన్ గార్డెన్స్ తో సునామీ సృష్టించాడు. ఇతనికి రింకు సింగ్  46 పరుగులు చేసి సహకరించడంతో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో  డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ చెరో  రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, హర్షల్ పటేల్, బ్రేస్ వెల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.