మరో తెలుగు డైరెక్టర్కు ఓకే చెప్పిన ధనుష్

మరో తెలుగు డైరెక్టర్కు ఓకే చెప్పిన ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) మరో తెలుగు డైరెక్టర్ కు ఓకే చెప్పాడట.రీసెంట్ గా విరాట పర్వం(Virata parvam) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల(Venu udugula) ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం.

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాను.. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా కూడా వేణు ఉడుగుల గత చిత్రాల మాదిరిగానే సామాజిక అంశాలతో రానుందని టాక్. ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఇప్పటికే కథ చర్చలు కంప్లీట్ ఆయాయని, డైరెక్టర్ వేణు చెప్పిన కథ  హీరో ధనుష్ కు బాగా నచ్చడంథ్ వెంటనే ఒకే చెప్పాడని సమాచారం. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. 

ఇక ప్ర‌స్తుతం ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయినా వెంటనే.. వేణు సినిమా మొదలుపెట్టనున్నాడట ధనుష్. మరి ఈ సినిమా కూడా సార్ మూవీలా సూపర్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.