రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ అనడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ రావడానికి కారణం భారత రాజ్యాంగమని ఆయన అన్నారు. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని.. పైగా బీజేపీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య 6లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు గురించి నితిన్ గడ్కరీని కలిసినట్లు ఆయన తెలిపారు. జీఎంఆర్ కాంట్రాక్టు ఉపసంహరణపై చర్యలు తీసుకోవాలని, వేగవంతంగా రోడ్డు పనులు చేపట్టేలా చూడాలని గడ్కరీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
For More News..
మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు
మోడీపై కేసీఆర్ యుద్దం ప్రకటిస్తారనుకున్నాం