
కొమురవెల్లి, వెలుగు: కొమురెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని గోశాలలోని కో సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. ఆదివారం కొమురవెల్లిలోని తోటబావి వద్ద ఉన్న గోశాలను దేవాలయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తోటబావి వద్ద గోశాలను ఈఓ ఎస్.అన్నపూర్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడి పశువుల యోగక్షేమాలను తెలుసుకుని గోశాల సంరక్షణకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ (సివిల్) సతీశ్, జూనియర్ అసిస్టెంట్ మధుకర్, శానిటేషన్ ఇంచార్జ్ సార్ల విజయకుమార్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.