షర్మిల పార్టీలో ఉన్నది నేతలు కాదు.. వైఎస్సార్ భక్తులు

షర్మిల పార్టీలో ఉన్నది నేతలు కాదు.. వైఎస్సార్ భక్తులు

షర్మిల పార్టీ రాజన్న రాజ్యం స్థాపన కోసం పుడుతున్న పార్టీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి అన్నారు. షర్మిల పార్టీలో ఉన్నది నేతలు కాదని.. వాళ్లంతా వైఎస్ఆర్ భక్తులు అని ఆయన అన్నారు. 

‘షర్మిల పార్టీ ఆషామాషీ పార్టీ కాదు. రాజన్న రాజ్యం స్థాపన కోసం పుడుతున్న పార్టీ అది. ఇడుపాయలలో వైఎస్ ఘాట్‌ వద్ద గురువారం షర్మిల నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాక షర్మిలకు ఘన స్వాగతం ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉంటుంది. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించే సభకు వైఎస్సార్ ప్రజా ప్రాంగణం అని పేరు పెట్టాం. రేవంత్ కాంగ్రెస్ పార్టీ‌కి అధ్యక్షుడు కాదు... సైకిల్ కాంగ్రెస్‌కి అధ్యక్షుడు. రేవంత్ ఎఫెక్ట్ మా పార్టీపై పడదు. వైఎస్సార్ గురించి తప్పుగా మాట్లాడి.. ఇప్పుడు ఎత్తుకున్నట్లు మాట్లాడటం సిగ్గుచేటు. రాజశేఖర్ రెడ్డిపై రేవంత్‌కున్నది కపట ప్రేమ మాత్రమే. వైఎస్సార్ అభిమానులు షర్మిల పార్టీ వెంటే ఉంటారు. వైఎస్ పాలనపై కేసీఆర్ పాలనపై టీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? షర్మిల పార్టీలో ఉన్నది నేతలు కాదు.. వైఎస్సార్ భక్తులు’ అని కొండా అన్నారు.