తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : శ్రీనివాస్​రావు

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : శ్రీనివాస్​రావు
  • కాంగ్రెస్​ నేతలు కొండల్​రెడ్డి, డీసీసీ  ప్రెసిడెంట్ శ్రీనివాస్​రావు

కామారెడ్డి, కామారెడ్డిటౌన్,  వెలుగు : రాష్ట్రంలో  రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని,  అన్ని వర్గాల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని  ఆ పార్టీ నేతలు కొండల్​రెడ్డి, డీసీసీ  ప్రెసిడెంట్ శ్రీనివాస్​రావు పేర్కొన్నారు.   కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి  రేవంత్​రెడ్డి తరపున నియోజక వర్గంలో  మంగళవారం ఆ పార్టీ నేతలు   ప్రచారం నిర్వహించారు.  మంగళవారం పొద్దున  జిల్లా కేంద్రంలో వాకర్స్​ను కలిసి ప్రచారం చేశారు.   ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని  కోరారు.  కొండల్​రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను తమ పార్టీ సమానంగా  చూస్తుందన్నారు.   ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.  కొత్త బస్టాండు ఎదుట ఉన్న చాయ్​ హోటల్స్​లో  కూడా  కొండల్​రెడ్డి  చాయ్ తయారీ చేస్తూ  ప్రజలతో మాట్లాడారు.  తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్​  ప్రభుత్వం  సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదన్నారు. శ్రీనివాస్​రావు మాట్లాడుతూ  రేవంత్​రెడ్డిని గెలిపిస్తే ఆయన సీఎంఅవుతారన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్​ ఫంక్షన్​ హాల్​లో జరిగిన   కుర్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కొండల్​రెడ్డి, ఏఐసీసీ ఇన్​చార్జి రిజ్వాన్ పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి  కాంగ్రెస్ కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.    జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్​లో  పీసీసీ జనరల్​ సెక్రెటరీ పున్న కైలాస్​ నేత  మాట్లాడుతూరాష్ర్ట భవిష్యత్తును నిర్ణయించేది కామారెడ్డి నియోజక వర్గమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో  నాయకులు రజాక్​, శివకృష్ణమూరక్తి, ప్రసాద్​గౌడ్​, నిఖిల్​ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :  తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి : మురళి నాయక్