రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

మధిర, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్​ చేశారు. గురువారం మధిర నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం రోజే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించకపోవడం రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు.

రైతు భరోసా దేవుడెరుగు.. ఇంతవరకు రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలే రాలేదని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేశ్, మండల అధ్యక్షుడు గుండా చంద్రశేఖర్ రెడ్డి , యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు