కోల్కతా : ఆడిట్, ట్యాక్స్ ఎడ్వైజరీ కంపెనీ కేపీఎంజీ ఎల్ఎల్పీ కోల్కతాలో కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ ప్రారంభించింది. ఈ సెంటర్లో ప్రస్తుతం 250 మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తుండగా, 2025 నాటికి ఈ సంఖ్యను డబుల్ చేస్తారు. గ్రోత్ స్ట్రేటజీలో భాగంగానే ఇక్కడ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఆఫీసును తెరచినట్లు కేపీఎంజీ వెల్లడించింది. ఆడిట్ ప్రస్తుతం డేటా–డ్రివెన్గా మారుతోందని
కోల్కతా సెంటర్లోని ప్రొఫెషనల్స్ తమ వద్ద ఇప్పటికే ఉన్న స్కిల్డ్ ప్రొఫెషనల్స్తో కలిసి పనిచేస్తారని కేపీఎంజీ యూఎస్ నేషనల్ మేనేజింగ్పార్ట్నర్ (ఆడిట్ ఆపరేషన్స్) టిమ్ వాల్ష్ చెప్పారు. తమ గ్లోబల్ ఆడిట్ స్ట్రేటజీలో గ్లోబల్ డెలివరీ సెంటర్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.