నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్ కమిటీ

 నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్ కమిటీ

హాలియా, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నది జలవివాదం అధ్యయనంలో భాగంగా కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్ కమిటీ బుధవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ డ్యాం, గ్యాలరీలు, క్రస్ట్ గేట్లు, కుడి, ఎడమ కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పరిశీలించారు. కమిటీ పర్యటన అనంతరం ప్రాజెక్ట్​కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కృష్ణా రివర్​బోర్డుకు అందించనుంది. సందర్శించిన వారిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా, ఎస్ఈ అశోక్ కుమార్, ఈఈలు శివప్రసాద్, రాఘవేంద్రరావు, సాగర్ డ్యామ్ ఈఈ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.