కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు అదానీకే

కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు అదానీకే

విజయవాడ: దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును సైతం దక్కించుకుంది. ఏపీ క్యాబినెట్ కూడా అప్రూవల్  ఇచ్చింది. ఒకటిన్నర నెల తర్వాత కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. మొత్తం 13,572 కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకుంది. కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది ప్రభుత్వం. కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు ఇకపై అదానీ గ్రూప్ కే సంబంధం..  ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ భారీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు.