బేబమ్మ కృతి శెట్టి (Kriti Shetty)కి టాలీవుడ్లో ప్రస్తుతానికి పెద్దగా సినిమాలేం లేవు. మాచర్ల నియోజకవర్గం, వారియర్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నా..ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవలే వచ్చిన కస్టడీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఆమె క్రేజ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తోంది. అయితే మిగతా భాషల్లో ఆమె బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం కృతి తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లను అందుకుంటోంది. తాజాగా స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఆ మూవీలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించనుంది. ఈ మూవీకి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్- ఎల్ ఐసీగా పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్ బాణీలు అందించనుండగా..ఎస్ జే సూర్య, యోగిబాబు కీలకపాత్రలు పోషించనున్నారట.
❤️❤️❤️ lots of love ❤️ to you Pradeep bro ! Thank you ❤️❤️ #LoveInsuranceCorporation #LIC https://t.co/egcF6bWb36
— VigneshShivan (@VigneshShivN) December 15, 2023
ఈ సినిమా కన్నా ముందు జయం రవి హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ జీని లోనూ కృతి ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో లీడ్ రోల్ పోషించనుంది. ఇవే మూవీస్ కాకుండా మరికొన్ని కోలీవుడ్ సినిమాల నుంచి మంచి ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉంది.
ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు మలయాళ స్టార్ టోవినో థామస్ అజయంతే రాండమ్ మోషణం అనే ఫాంటసీ అడ్వెంచర్ లో మెరవనుంది.