జూబ్లీహిల్స్లో చోరీ కా ఓట్ : కేటీఆర్

జూబ్లీహిల్స్లో చోరీ కా ఓట్ : కేటీఆర్
  • అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటికి 23 వేల ఓట్లు పెరిగినయ్: కేటీఆర్​
  • కేంద్ర ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ ఆరోపించారు. బిహార్​లో జరుగుతున్నది ఓట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ అయితే ఇక్కడ జరుగుతున్నది ‘చోరీ కా ఓట్’ అని కామెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటివరకు జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలో 23 వేల ఓట్లు పెరిగాయన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్​ లిస్టుతోనే ఈ అక్రమాలు బయటపడ్డాయన్నారు. దీనిపై చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ సుదర్శన్​ రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. అయితే, అధికారులు మాత్రం లిస్టు నుంచి 12 వేల మందిని తొలగించామని చెప్పారని, అలాంటప్పుడు 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. 

మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఓటర్​ లిస్టుపై పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్​ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచేందుకు కాంగ్రెస్​ ఓట్​చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. సంస్కృతి అపార్ట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే ఇంటి నంబర్​పై 43 ఓట్లు, బూత్​ నంబర్​ 125లో ఒకే ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయన్నారు. హౌస్​ నంబర్​ 118లోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్లో 32 ఫేక్​ ఓట్లు రిజిస్టర్ అయ్యాయన్నారు. సెప్టెంబర్​ 2న ఒకేరోజు వేల ఓట్లను ఎలా యాడ్​ చేశారని ఆయన ప్రశ్నించారు. ఒకే వ్యక్తి పేరుతో మూడు ఓట్లు, మూడు ఓటర్​ కార్డులున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ తమ్ముడు.. ప్రవీణ్​ యాదవ్​కు మూడు ఓట్లున్నాయన్నారు. బూత్​ లెవెల్​ ఆఫీసర్లతో కాంగ్రెస్​ పార్టీ కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో యాడ్​ అయిన 23 వేల ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం లేదని కేటీఆర్​ ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. మాగంటి సునీత భావోద్వేగం చెందడాన్ని విమర్శించిన కాంగ్రెస్​ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. ఒక మహిళగా, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, ఆవేదన ఆమెకు ఉండదా? అని ప్రశ్నించారు.