హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ నేతలు కేటీఆర్,హరీశ్ రావు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై గురువారం తెలంగాణ భవన్లో కౌంటింగ్ ఏజెంట్లు, కేడర్తో వారు సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనుమానం ఉన్నట్టు అనిపిస్తే ఒకటికి రెండు సార్లు మళ్లీ ఓట్లు లెక్కించేలా కౌంటింగ్ అధికారులకు ఏజెంట్లు విజ్ఞప్తి చేయాలని సూచించినట్టు తెలిసింది.
పోలింగ్ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్, హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కౌంటింగ్లోనూ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు సూచించారు.
