
- లేదంటే క్షమాపణ చెప్పాలి
- దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సవాల్
మహబూబ్నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహబూబ్నగర్ డీసీసీ ప్రెసిడెంట్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఫైర్అయ్యారు.
“ కేటీఆర్.. దమ్ముంటే చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్లు నిరూపించాలి. లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి”అని ఆయన సవాల్చేశారు. మహబూబ్నగర్జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంపై కేటీఆర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రాచాల వద్ద చెక్ డ్యామ్ తెగిపోలేదని, మునుగాల్చెడ్ చెరువు నింపడానికి నిర్మించిన గైడ్ వాల్మాత్రమే తెగిపోయిందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్లో కూర్చొని ట్విట్టర్లో పోస్టులు పెట్టడం ఏంటని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్ ఈఈ చెక్ డ్యాంను పరిశీలించి ఎలాంటి ముప్పు లేదని రిపోర్ట్ఇచ్చారన్నారు.
అధికారులు ఇచ్చిన రిపోర్టును పక్కనపెట్టి, చెక్ డ్యామ్ కూలినట్టు కేటీఆర్ట్విట్టర్ లో తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. గైడ్వాల్కొట్టుకుపోయి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముడా చైర్మన్లక్ష్మణ్యాదవ్ నేతలు ఉన్నారు.