
మెదక్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మెదక్ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై వివాదాస్పద పోస్ట్ పెట్టి.. పోలీస్ స్టేషన్కు వెళ్లొచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్నర్సింగ్రావుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్లో కేటీఆర్ను నర్సింగ్రావు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నిన్ను బెదిరించినోడి పేరేందో చెప్పు. ఆ సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్పేర్లు రాసిపెట్టు. జరిగిన దానికి మన తరఫున హిసాబ్.. కితాబ్ చూస్కుందం. నీలాంటోళ్లు పది మంది దొరికితే అగ్గిపెట్టొచ్చు” అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నువ్వు చేసింది తప్పు కాదు.. నీకు జరిగింది తప్పు.. వాళ్ల బలుపు అట్లున్నది..మనకు టైమొస్తది తమ్మీ” అంటూ నర్సింగ్రావుతో అన్నారు.