నీలాంటోల్లు పది మంది దొరికితే చాలు అగ్గి పెట్టచ్చు ..కేటీఆర్​ కాంట్రవర్సీ కామెంట్స్

నీలాంటోల్లు పది మంది దొరికితే చాలు అగ్గి పెట్టచ్చు ..కేటీఆర్​ కాంట్రవర్సీ కామెంట్స్

మెదక్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కాంట్రవర్సీ కామెంట్స్​ చేశారు. మెదక్​ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​పై వివాదాస్పద పోస్ట్​ పెట్టి.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లొచ్చిన ఆ పార్టీ సోషల్​ మీడియా వారియర్​నర్సింగ్​రావుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్​లో కేటీఆర్​ను నర్సింగ్​రావు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ..  ‘నిన్ను బెదిరించినోడి పేరేందో చెప్పు. ఆ సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్​పేర్లు రాసిపెట్టు. జరిగిన దానికి మన తరఫున హిసాబ్.. కితాబ్​ చూస్కుందం. నీలాంటోళ్లు పది మంది దొరికితే అగ్గిపెట్టొచ్చు” అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నువ్వు చేసింది తప్పు కాదు.. నీకు జరిగింది తప్పు.. వాళ్ల బలుపు అట్లున్నది..మనకు టైమొస్తది తమ్మీ” అంటూ నర్సింగ్​రావుతో అన్నారు.