- మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ హింట్
- టికెట్ల కోసం తరలివచ్చిన లీడర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్, అక్టోబర్లో పోలింగ్ఉంటుందని, రెడీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ హింట్ ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీలోని కేటీఆర్ చాంబర్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. వారితో కేటీఆర్మాట్లాడుతూ, సెప్టెంబర్మొదట్లోనే ఎన్నికల షెడ్యూల్, మూడో వారంలో నోటిఫికేషన్వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలకు అందరు రెడీగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారు. అక్టోబర్నెలాఖరులో పోలింగ్ ఉంటుందని చెప్పారు. రైతు రుణమాఫీ, నోటరీ ల్యాండ్స్రెగ్యులరైజేషన్, దళితబంధు, బీసీ కులవృత్తులు, మైనార్టీలకు రూ.లక్ష సాయం సహా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
కేటీఆర్ను కలిసేందుకు పోటెత్తిన నేతలు
అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్ను కలిసేందుకు బీఆర్ఎస్నేతలు పోటెత్తారు. అసెంబ్లీకి టీ బ్రేక్ఇచ్చిన తర్వాత లాబీ నుంచి తన చాంబర్వైపు వస్తూ.. అక్కడ గుమికూడి ఉన్న నేతలను చూసి అసహనానికి గురయ్యారు. ‘‘ఇంత మంది జనాలెలా లోపలికి వచ్చారు.. ఎవరు రానిచ్చారు..” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంత మందిని ఎలా రానిచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత తనను కలిసిన కొందరు నాయకులపైనా అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
చాలా మంది నేతలు తన చాంబర్వద్దనే ఉండటంతో కేటీఆర్రాత్రి వరకు మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆయన రాకకోసం నేతలంతా లాబీల్లోనే పడిగాపులు కాశారు. రాత్రి ఏడున్నర గంటల తర్వాత కేటీఆర్తన చాంబర్కు వచ్చి కొందరు నేతలను పిలిపించి మాట్లాడారు.
టికెట్ ప్లీజ్..
తమకు టికెట్ఇవ్వాలని పలువురు నేతలు మంత్రి కేటీఆర్ను కలిసి అభ్యర్థించారు. స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే టికెట్తన కూతురు కావ్యకు ఇవ్వాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేటీఆర్ను కోరినట్టు తెలిసింది. కేటీఆర్ చాంబర్లో శ్రీహరి ఉన్నంత సేపు ప్రస్తుత స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే రాజయ్య లాబీలో ఆయన చాంబర్కు ఎదురుగా వేచి చూస్తూ కనిపించారు. ఉమ్మడి వరం గల్జిల్లాకు చెందిన దాదాపు పది మంది వరకు లీడర్లు కేటీఆర్ను కలిసి తమకు చాన్స్ ఇప్పించాలని కోరారు. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులు కేటీఆర్ను కలిసి తమకు టికెట్లేదంటే ఇతరత్రా అవకాశాలు కల్పించాలని అభ్యర్థించినట్టు తెలిసింది.
నాకు ఎవరూ క్లోజ్ కాదు..
తనకు ఎవరూ క్లోజ్కాదని.. చందర్ రామగుండం ఎమ్మెల్యే కాబట్టే ఆయనతో మాట్లాడుతున్నానను తప్ప ఆయన తనకు దగ్గర అని అనుకుంటే ఎలానని రామగుండం బీఆర్ఎస్ అసంతృప్త నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్న నాయకులతో శుక్రవారం రాత్రి కేటీఆర్సమావేశమయ్యారు. తమపై ఎమ్మెల్యే ఎలాంటి కేసులు పెట్టి వేధించారో వారు కేటీఆర్కు వివరించారు. కేటీఆర్స్పందిస్తూ.. కేసులు పెట్టిన విషయం తనకు తెలియదని, తనకు పార్టీలోని నాయకులంతా సమానమేనని చెప్పారు. సర్వే రిపోర్టు ప్రకారమే టికెట్లు ఇస్తామని, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడొద్దని, నష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోరారు. రామగుండం నియోజకవర్గ ఇన్చార్జీగా మంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధ్యతలు ఇస్తున్నానని, ఆయనతో కలిసి పనిచేయాలని సూచించారు.
కేటీఆర్ను కలిసిన పమేలా.. గంటల్లోనే పోస్టింగ్
యాదాద్రి భువనగిరి కలెక్టర్గా పనిచేసి బదిలీ వేటు పడిన పమేల సత్పత్తి శుక్రవారం ఉదయం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ను కలిశారు. మంత్రిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆమెకు పోస్టింగ్ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మరో ఐఏఎస్అధికారికి మంత్రి కేటీఆర్శాఖల్లోనే పోస్టింగ్ఇస్తూ జీవో ఇచ్చారు. పమేలా సత్పతిని కమిషనర్అండ్ డైరెక్టర్, మున్సిపల్అడ్మినిస్ట్రేషన్గా నియమించి ఆ స్థానంలో అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న సుదర్శన్రెడ్డిని రిలీవ్చేశారు. కృష్ణభాస్కర్ను ఇండస్ట్రీస్డైరెక్టర్గా నియమించి ఆ స్థానంలో అదనపు బాధ్యతల్లో పని చేస్తున్న నర్సింహారెడ్డిని రిలీవ్చేశారు.