
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు మన బడి కార్కక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. న్యూ జెర్సీలోని ఎడిషనల్ టౌన్ షిప్ లో మన ఊరు మన బడి NRI పోర్టల్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఇందులో NRIలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు. 7 వేల 300 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఎన్ఆర్ఐలను కోరారు మంత్రి కేటీఆర్.