కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నడు

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నడు
  • నవీన్​ యాదవ్​పై రౌడీషీట్​ఎక్కడుందో చూపించాలి
  • ఏఐసీసీ కోఆర్డినేటర్ రవిశేఖర్ రెడ్డి 

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: కేటీఆర్​మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కోఆర్డినేటర్​డాక్టర్​రవిశేఖర్​రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎర్రగడ్డ లక్ష్మీ కాంప్లెక్స్​వద్ద ఎమ్మెల్సీ దండే విఠల్​తో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్​కాంగ్రెస్​అభ్యర్థి నవీన్​యాదవ్ ఆర్కిటెక్చర్​చదివాడన్నారు. ఆయనపై  రౌడీషీట్ ఎక్కడుందో చూపించాలని సవాల్​చేశారు.

 కనీస విద్యార్హత లేని వ్యక్తిని నిలబెట్టి, సానుభూతి ఓట్లతో  గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు వివేకవంతులని, బీఆర్ఎస్​నాయకుల జిమ్మిక్కులను వారు నమ్మరని పేర్కొన్నారు. కేటీఆర్​కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇలాగే మాట్లాడితే రాబోయే రోజుల్లో  ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.