ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నాం

ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నాం
  • ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయిస్తుందని  ఆశిస్తున్నామన్నారు రాష్ట్ర పురపాలకశాఖ,ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు కేటీఆర్. ఏపీ పునర్ విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. నీతి అయోగ్ చెప్పినట్లు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులివ్వాలని కోరారు. ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీల తాలూకు ఇంగ్లీషు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లను తన ట్విట్టర్ ఖాతాలో జోడించారు కేటీఆర్. 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

GO 317పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా

మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్