
రేపిస్టులు దోషులుగా తేలినప్పుడు వారు మరణించే వరకు జైలులోనే ఉండాలని, అందుకు అనుగుణంగా చట్టాలను సవరించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ? ఆ కేసులో నిందితులు బయటే ఉన్నారు’’ అంటూ కొందరు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.‘‘నిందితులను వేగంగా అరెస్టు చేసి వారిని జైలుకు పంపాం. 45 రోజుల తర్వాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడుతాం’’ అని మంత్రి ట్వీట్ చేశారు.
To the silly trolls who indulge in whataboutery & question what #Telangana Govt did in recent rape case in Hyderabad
— KTR (@KTRTRS) August 19, 2022
The Rapists were arrested swiftly & sent to jail. After 45 days, the High Court had granted them Bail
We will fight on till these rapists get punished as per law
జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC & CrPCలోని లొసుగుల ఫలితంగా నిందితులు అత్యాచార కేసుల్లో బెయిల్పై బయటికి రావడానికి కారణమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదని, దోషిగా తేలినప్పుడు మరణించే వరకు జైలులోనే ఉండాలని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా గుజరాత్ లో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో నిందితులను క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
Loopholes in Juvenile Justice Act, IPC & CrPC have resulted in the rapists getting out on Bail in JH rape case
— KTR (@KTRTRS) August 19, 2022
That’s the reason why I am demanding that these acts be amended so no Rapist gets a bail & when convicted remains in Jail till death
Life imprisonment in truest sense