నిజాంపేటలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

నిజాంపేటలో రూ.2 వేల కోట్ల కుంభకోణం
  • బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్

 
జీడిమెట్ల, వెలుగు: జీవో నం.​58,59 ద్వారా నిజాంపేట​ మున్సిపల్​ కార్పొరేషన్​లో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధులు రూ.2వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ​ఆరోపించారు. నిజాంపేటలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా..  58,59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న మొత్తం 12 సర్వే నంబర్లలోని భూములను సోమవారం ఆయన పరిశీలించారు.

ఇతర నేతలతో కలిసి అక్కడ ఆందోళన చేపట్టారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ ​భర్తతోపాటు కొందరు కార్పొరేటర్లు సుమారు రూ.2వేల కోట్ల విలువగల వెయ్యి ప్లాట్లను 58,59 జీవోల ద్వారా కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.