
ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ ఇంట విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్దుల్లా ఖాన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
"మీతో కలకాలం ఉండాలని ఎంత కోరుకున్నా. కానీ వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. మీ ప్రేమ ఎప్పుడూ మాతోనే ఉంటాయి. నా సోదరుడు తిరిగి రావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఖుష్బు కుటుంబం ముంబైలోని అంధేరిలో నివసించేది. ఖుష్బుకు అబ్దుల్లా, అబూ బకర్, అలీ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. అబ్దుల్లా కొన్ని సినిమాల్లో నటించారు.