ఉక్రెయిన్, రష్యా మధ్య 19 రోజులుగా యుద్ధం సాగుతోంది. ఓ వైపు చర్చలు అంటూనే రష్యా దండయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. యుద్ధ భూమి నుంచి విదేశీయులు, ఉక్రెయిన్ పౌరులు సేఫ్గా బయటపడేందుకు హ్యుమానిటేరియన్ కారిడార్లు ఏర్పాటు చేయడం, ఆయా సమయాల్లో కాల్పుల విరమణ పాటించడం మినహా సాధించిందేమీ లేదు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి రెండు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారని రష్యన్ వార్తా సంస్థ సుత్నిక్ పేర్కొంది.
Kyiv confirms video-conference talks with Moscow Monday: AFP reports#UkraineRussiaWar
— ANI (@ANI) March 13, 2022