
హైదరాబాద్, వెలుగు: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్టీఎఫ్)కు ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లోరూ. 735 కోట్ల నికర లాభం (పీఏటీ) వచ్చింది. గత ఏడాది రెండో క్వార్టర్తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. కంపెనీ రిటైల్ బుక్ సైజ్ విలువ రూ. 1,04,607 కోట్లకు చేరింది. ఏడాది లెక్కన 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రెండో క్వార్టర్లో రిటైల్ డిస్ట్రిబ్యూషన్ల విలువ రూ. 18,883 కోట్లుగా నమోదయింది. ఏడాది లెక్కన 25 శాతం పెరిగింది. రిటైలైజేషన్ 98 శాతంగా ఉంది. కస్టమర్- ఫేసింగ్ డిజిటల్ చానెల్ ‘ప్లానెట్’ యాప్ను రెండు కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. రేటింగ్ఏజెన్సీ ఎస్ అండ్ పీ కంపెనీ అంతర్జాతీయ ఇష్యూయర్ లాంగ్-టర్మ్ క్రెడిట్ రేటింగ్లను "బీబీబీ/స్టేబుల్"కి అప్గ్రేడ్ చేసింది.
దీనివల్ల కంపెనీ ప్రపంచ పెట్టుబడి మార్కెట్లను ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుందని ఎల్టీఎఫ్ ఎండీ, సీఈఓ సుదీప్త రాయ్ అన్నారు. గోల్డ్ లోన్స్ విభాగంలో దూకుడుగా విస్తరిస్తామని తెలిపారు.