అయిజలో జిన్నింగ్ మిల్లులపై ఆఫీసర్ల తనిఖీలు

అయిజలో జిన్నింగ్  మిల్లులపై ఆఫీసర్ల తనిఖీలు

అయిజ, వెలుగు: పట్టణ శివారులోని రైస్, జిన్నింగ్  మిల్లులపై కార్మిక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఓ జిన్నింగ్ మిల్లులో రెస్క్యూ ఆపరేషన్  నిర్వహించి అక్కడ పని చేస్తున్న ఓ బాలికను గుర్తించారు. బాలికను మహబూబ్ నగర్  బాలికల సంరక్షణ విభాగం ఆఫీసుకు తరలించినట్లు కార్మిక శాఖ జూనియర్  అసిస్టెంట్, జిల్లా బాలల సంరక్షణ అధికారి లక్ష్మీదేవి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలన్నారు. చైల్డ్  హెల్ప్  లైన్  ఆఫీసర్​ లక్ష్మి, పోలీస్  సిబ్బంది హనుమంతు, శివన్న పాల్గొన్నారు.