
హుస్సేన్ సాగర్ సరసన హెచ్ఎండిఏ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ అక్టోబర్ 1 ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ను సెప్టెంబర్ 26వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు వాకర్స్ టైమింగ్స్ నిర్ణయించారు. నెలకు రూ.100/- ల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
Also Read :- అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే
లేక్ ఫ్రెండ్ పార్కులో రూ.11,000/- లు చెల్లించి ప్రత్యేకంగా బర్త్ డే ఫంక్షన్లు, గెట్ టుగెదర్ ఫంక్షన్లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండిఏ ఈ పార్కులో కల్పిస్తుంది.
లేక్ ఫ్రంట్ పార్క్ లో కరాచీ బేకరీ అవుట్ లెట్ తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ సందర్శకుల కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.