
కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నీలో నిరాశ పరిచింది. యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మెన్స్లో లక్ష్యసేన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో 12వ ర్యాంకర్ సింధు 20–22, 13–21తో 36వ ర్యాంకర్ జావో ఫెంగ్ జియె (చైనా) చేతిలో వరుస గేమ్స్లో పరాజయం పాలైంది. ఫెంగ్తో ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లో సింధు మూడుసార్లు ఓడిపోవడం గమనార్హం. గతవారం కెనడా ఓపెన్ నెగ్గి జోరుమీదున్న లక్ష్యసేన్ మెన్స్ క్వార్టర్స్లో21–10, 21–17తో ఇండియాకే చెందిన శంకర్ ముత్తుస్వామిపై విజయం సాధించాడు. సెమీస్లో లక్ష్య రెండో సీడ్ లిషి ఫెంగ్ (చైనా)తో పోటీ పడనున్నాడు.