యోగాను ప్రపంచ స్థాయి తీసుకువెళ్లడానికి కారణమిదే

యోగాను ప్రపంచ స్థాయి తీసుకువెళ్లడానికి కారణమిదే

వ్యక్తికి ఉండే అన్ని సమస్యలకు ఆధ్యాత్మిక చింతేనే పరిష్కారమని.. అందుకే ప్రధాని మోడీ యోగా ను ప్రపంచ స్థాయి తీసుకువెళుతున్నారని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ సంత్ రవిదాస్ 621వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు.

ముందుగా  శ్రీ సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన లక్ష్మణ్.. అనంతరం ఆయన గురించి మాట్లాడుతూ…  శ్రీ సంత్ రవిదాస్ ను ఆధ్యాత్మిక గురువుగా భావించి పూజలు చేస్తారని, ఆయన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. పుట్టుక తో ఎవరు శూద్రులు కాదు అని చెప్పిన వ్యక్తి రవిదాస్ అని అన్నారు. దళిత సామాజిక వర్గం లో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారని, దళితులలో పుట్టిన భక్తి కవిగా, ఒక ప్రవక్తగా ఎదగడానికి ఆయన చేసిన పోరాటం ఈనాటికీ దళితులకు ఒక స్ఫూర్తి అని అన్నారు లక్ష్మణ్.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి,మంత్రి శ్రీనివాస్, ఇతర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

laxman-talks-about-sri-sant-ravi-das-at-bjp-office-hyderabad