
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇందారం1ఏ అండర్ గ్రౌండ్ బొగ్గు గనికి సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. గోదావరి వాటర్ వార్నింగ్ లెవల్ 830 మీటర్లకు సమీపంలోకి రావడంతో గురువారం నైట్షిప్ట్, శుక్రవారం ఫస్ట్, సెకెండ్షిప్టులకు వచ్చే కార్మికులకు లేఆఫ్వర్తింపజేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లే ఆఫ్కారణంగా దాదాపు 600 టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గనుంది.1,100 మంది కార్మికులు సగం వేతనం కోల్పోయారు.
నీటి ప్రవాహాన్ని బట్టి తర్వాతి షిఫ్టులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డి, ఇందారం గని పీవో శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలపై ఫోకస్పెట్టారు. అలాగే11 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం, ఖైరీగురా ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ఓవర్ బర్డెన్పనులు స్తంభించాయి.