
న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ఉద్యోగులను తొలగిస్తోంది. వారికి అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది.మార్చి 2024 క్వార్టర్లో పేటీఎం సేల్స్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,500 తగ్గి 36,521 మందికి పడిపోయింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంత మందిని తీసేశారనే విషయాన్ని పేటీఎం వెల్లడించలేదు. కస్టమర్ ఖాతాలు, వాలెట్లు ఫాస్ట్ట్యాగ్లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్లను తీసుకోకుండా పేటీఎంపై ఆర్బీఐ నిషేధం విధించింది.